See which of your colleagues or former colleagues are already on Loksatta Fans: Check out the Contact Finder
News »Browse Articles » లోక్‌సత్తా పార్టీ తొలి పౌరసేవా కేంద్రం ఏర్పాటు
+1
Vote Vote

లోక్‌సత్తా పార్టీ తొలి పౌరసేవా కేంద్రం ఏర్పాటు

Views 15 Views    Comments 2 Comments    Share Share    Posted 04-05-2009  
పౌరుల సమస్యలకు చట్టబద్ధంగా పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ లోక్‌సత్తా ఆధ్వర్యంలో పౌర సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణన్ తెలిపారు. శనివారం పద్మారావునగర్‌లో లోక్‌సత్తా తొలి పౌర సేవా కేంద్రం ప్రారంభమైంది.

దీనిని ప్రారంభించిన సందర్భంగా జేపీ మాట్లాడుతూ.. తాజా ఎన్నికల్లో తమ పార్టీకి వంద సీట్లు లభించినా పొంగిపోమని, ఒక్క సీటు లభించినా కుంగిపోమని చెప్పారు. తమ ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకు వెళతామన్నారు.

తాజా పౌర సేవా కేంద్రం అన్ని పనిదినాల్లోనూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. ప్రజలు తమ సమస్యలపై 2750 5999 ఫోన్‌నెంబర్‌కు కాల్ చేసి చెబితే.. లోక్‌సత్తా ప్రతినిధులు సమస్య పరిష్కారానికి తమ వంతు సాయం అందిస్తారని జేపీ తెలిపారు.
+1
Vote  Vote
Enter your comment:
Bharath 08-05-2009
this is awesome......
It will be much better if they give the numbers of the candidates for election to the public..........
Srinivas 10-05-2009
This is a very good initiation.

Search News

What's the News?

Post a link to something interesting from another site, or submit your own original writing for the Loksatta Fans community to read.