See which of your colleagues or former colleagues are already on Loksatta Fans: Check out the Contact Finder
News »Browse Articles » నాకు వైఎస్ సమాధానం చెప్పాలి: జేసీ
0
Vote Vote

నాకు వైఎస్ సమాధానం చెప్పాలి: జేసీ

Views 15 Views    Comments 0 Comments    Share Share    Posted 25-05-2009  
కొత్త ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి రానందుకు తానేం బాధపడడం లేదని పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. అదేసమయంలో ఈసారి తనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ విషయమై జేసీ మాట్లాడుతూ మంత్రి పదవి లభించకున్నా ముఖ్యమంత్రితో తన సంబంధాలను కొనసాగిస్తానని అన్నారు. అలాగే సోమవారం జరిగే మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరవుతానని కూడా ఆయన తెలిపారు. మంత్రివర్గం ఏర్పాటు అనేది ముఖ్యమంత్రి అభీష్టం మేరకు జరిగినా తనకు ఎందుకు పదవి ఇవ్వలేదో ముఖ్యమంత్రి చెప్పాల్సి ఉంటుందని అన్నారు.

కొత్త మంత్రివర్గంలో స్థానం సంపాదించిన 35మంది పేర్లతో ముఖ్యమంత్రి వైఎస్ సోమవారం జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో మాజీ మంత్రులైన చాలామందికి ఈసారి పదవీ యోగం లభించలేదు. దీంతో ముఖ్యమంత్రిపై అసంతృప్తితో ఉన్న సదరు నేతలు తమ అసహనాన్ని వివిధ రూపాల్లో బయటపెట్టే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం.
0
Vote  Vote
Enter your comment:
No Comments For This News

Search News

What's the News?

Post a link to something interesting from another site, or submit your own original writing for the Loksatta Fans community to read.